హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

NGKL: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ గిరి మనోహర్‌రెడ్డి సూచించారు. సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా 'బీ సైబర్‌ విస్‌' పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్, లోన్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.