హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి LOC అందజేత

KMR: ఎల్లారెడ్డికి చెందిన చవాన్‌ రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయన పరిస్థితిని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్‌ నాయకుల ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.