హైదరాబాద్: 28°C
తెలంగాణ

లా పరీక్షలు వాయిదా వేయాలి: PDSU

WGL: కాకతీయ యూనివర్సిటీలో లా రెండో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించారు. పరీక్షల తేదీలకు వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు సన్నద్ధతకు సమయం సరిపోలేదన్నారు. కొన్ని న్యాయ కళాశాలల్లో సిలబస్‌ కూడా పూర్తికాలేదని తెలిపారు.