హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళేశ్వరం ఆలయ పనులపై కలెక్టర్‌ ఆదేశం

BHPL: కాళేశ్వరంలో రూ.198 కోట్లతో చేపట్టిన ముక్తేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ప్రతి నెలా స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. నాణ్యమైన కృష్ణశిలలను వినియోగిస్తూ రాతి, సివిల్‌ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు.