హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన సౌత్ జోన్

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో నార్త్ జోన్‌పై విజయం సాధించి సౌత్ జోన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో నార్త్ జోన్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈనెల 6న ఫైనల్‌లో ఈస్ట్ జోన్‌తో తలపడనుంది.