హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జీలు వీరే

MDK: బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఇన్‌ఛార్జీలను రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ జగ్మోహన్ సింగ్ నియమించారు. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జిగా మోహిందర్ సింగ్, సంగారెడ్డికి జూలీ బెన్నెలా, సిద్దిపేటకు ముఖేష్ చౌహాన్ ఎంపికయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ, మైనారిటీ వర్గాల సంక్షేమం, పార్టీ బలోపేతానికి నూతన ఇన్‌ఛార్జీలు కృషి చేయాలని జగ్మోహన్ సింగ్ సూచించారు.