హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

NGKL: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.