హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

SRD: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఖేడ్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదజల్లే వారికి ధీటుగా, పథకాల ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత అని అన్నారు.