హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష హత్యకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ

MHBD: ఆదివాసీ యువతి ఊకే శిరీషపై అత్యాచారం, హత్యకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిందితుడికి ఉరిశిక్ష వెయ్యాలని సర్పంచ్ గొంది సోని-రాజు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఆదివాసీ నాయకులు, మహిళలు ఉన్నారు.