హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పొడిగింపు

MDCL: ఉప్పల్‌ సివిల్‌ సప్లైస్‌ ఆఫీసర్‌ సంధ్య కీలక ప్రకటన చేశారు. జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్‌ బియ్యం తీసుకోని లబ్ధిదారులకు పంపిణీ గడువును సెప్టెంబర్‌ 5 వరకు పొడిగించినట్లు తెలిపారు. రేషన్‌ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోపు బియ్యం తీసుకోవాలని సూచించారు.