NDL: నందికొట్కూరులో ఈ నెల 12న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దివ్య తెలిపారు. కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులకు అవగాహన కల్పించి, వివాదాలను పరిష్కరించాలని సూచించారు. ఇరుపక్షాల కోసం ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరులో 12న లోక్అదాలత్


