హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగించాలి'

SDPT: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను కొనసాగించాలని ఎస్ఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అభిషేక్ భాను సూచించారు. మంగళవారం చిన్నకోడూరు మండల ఎస్ఎఫ్‌ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లోకేష్, కార్యదర్శిగా తనివిశ్రీ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.