ELR: తడికలపూడి SI వల్లి పద్మ పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అత్యంత అప్రమత్తంగా ఉపయోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. చదువుతో పాటు చట్టాలు, నేరాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన


