హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పత్తిపల్లికి దేవాదుల నీరు విడుదల

ములుగు మండలం పత్తిపల్లిలో ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు మంగళవారం దేవాదుల పైప్‌లైన్ ద్వారా ఎదల్ల చెరువులోకి నీటిని మళ్లించి, అక్కడి నుంచి పంట పొలాలకు విడుదల చేశారు. నీరు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ.. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.