హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి మండపాలకు కరెంట్ ఫ్రీ

HYD: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుందని తెలిపారు. పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, డీజేల వినియోగాన్ని నివారించాలని కోరారు.