KKD: గెద్దనాపల్లిలో సీఐ బి.తిరుపతిరావు, ఎస్సై జి.సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. యువత, విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వివరాలు పంచుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గెద్దనాపల్లిలో పోలీసుల పల్లెనిద్ర


