GNTR: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మాచవరం జడ్పీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కుశల్ కుమార్ (95 కేజీ విభాగం) ద్వితీయ స్థానం, రాకేశ్ (75 కేజీ విభాగం) ఆరో స్థానం సాధించారు. వీరితో పాటు వర్షిణి సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనట్లు సోమవారం హెచ్ఎం మహబూబ్ బాషా తెలపగా, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్లో మాచవరం విద్యార్థుల ప్రతిభ


