హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

WNP: మదనాపూర్ మండలంలోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత నెల రోజులుగా విద్య, వైద్యం, ఇతర స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చిన్న రాయుడు, చిరంజీవి, చంద్రాయుడు, సుధాకర్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.