అనంతపురం జిల్లా రుద్రంపేట పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ హిదయతుల్లా రూ. 8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం నాగేంద్ర అనే వ్యక్తిని లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలోనే నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ACB వలకు చిక్కిన పంచాయతీ సెక్రటరీ


