హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల రీ సర్వేను ఖచ్చితంగా పూర్తి చేయాలి'

SRCL: భూముల రీసర్వేను ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో భూ భారతి, సాదాబైనామా, SIR, 22A పై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో భూ వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించి గడువులోగా పూర్తి చేయాలన్నారు. సరిహద్దుల సర్వేలో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.