హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన'

NZB: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ సత్యనారాయణగౌడ్‌ పాల్గొని మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నిబంధనలు, షీ టీమ్స్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.