హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

గుంటూరు జిల్లా పోలీసు శాఖలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై ఎం. రవికుమార్, ఏఎస్సై టీ. శివరామ బాపయ్యలకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో వారిని సన్మానించి, ఆత్మీయంగా వీడ్కోలు తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు, ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు.