హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యర్నగూడెం వద్ద కానిస్టేబుల్‌పై దాడి

E.G: దేవరపల్లి (M) యర్నగూడెం వద్ద నేషనల్ హైవేపై కానిస్టేబుల్‌పై దుండగులు చాకుతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, నలుగురిని ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో ఇద్దరు పారిపోగా, మరో ఇద్దరు కానిస్టేబుల్ కడుపులో చాకుతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు.