KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పాడా ప్రాజెక్టు డైరెక్టర్ శివరాం ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు ఆన్లైన్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. నియోజకవర్గానికి చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పాడా కార్యాలయంలో PGRS కార్యక్రమం'


