హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్‌లో భారత్ ఘన విజయం

మహిళల టీ20 ఆసియా కప్‌లో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్‌లో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో నందనీ శర్మ, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి.