హైదరాబాద్: 28°C
క్రీడలు

దీప్తి శర్మ అరుదైన రికార్డ్

మహిళల ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. ఆమె కెరీర్‌లో ఇది 150వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. భారత్ తరఫున ఈ మైలురాయిని అందుకున్న మూడో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. అంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (202), స్మృతి మంధన (171) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.