హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం లో అన్నదాన కార్యక్రమం

కృష్ణా: మచిలీపట్నం 7వ డివిజన్‌ ఎస్.సి. కాలనీలో స్వేచ్ఛ ఎడ్యుకేషన్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సుమారు 1,050 మంది పేదలు, అభాగ్యులకు భోజనం అందించారు. సమాజ సేవే లక్ష్యంగా ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు ప్రారంభించడం అభినందనీయమని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు.