హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సోమవారం జిల్లా, మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు మీకోసం వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.