హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

MLG: వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కాట రాజేశ్వరి మహిళ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.