హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

ADB: ఆదిలాబాద్‌లోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, అభ్యర్థుల వసతులు, బయోమెట్రిక్‌ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల మేరకు ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.