హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేస్తూ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. నొప్పితో అతడు మైదానాన్ని వీడటంతో, 15 ఏళ్ల వయసున్న వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కుమార్‌ కుశాగ్ర వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.