హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 583 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు (17.802 టీఎంసీ)లకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 1,401.74 అడుగుల (13.367 టీఎంసీ)ల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.