హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహ వేడుకలో ఫుడ్‌ పాయిజన్.. 50 మందికి అస్వస్థత

JGL: కోరుట్ల మండలంలో శనివారం రాత్రి వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. సంగెం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన వివాహ విందు భోజనం తిన్న సుమారు 50 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిలో కొందరిని కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.