హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల హక్కులు కాపాడాలి: ఎమ్మెల్యే

MBNR: SIR-2026 గడువును మరో 4 వారాలు పొడిగించాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సమయోచితమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. దాదాపు 92.86 లక్షల మంది అర్హులైన పౌరులు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి గడువు పొడిగించాలన్నారు.