హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిశు మరణం ఘటనపై విచారణ పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక

NLG: నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చోటుచేసుకున్న గర్భస్థ శిశు మరణ ఘటనపై విచారణ పూర్తయినట్లు స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆసుపత్రిలో హెచ్‌ఓడీలు, డిప్యూటీ సూపరింటెండెంట్‌తో సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలు, వైద్యసిబ్బంది వివరణలను అయన జిల్లా కలెక్టర్‌కు తెలియజేయునన్నారు.