హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రావణ్‌కుమార్ దంపతులను ఆశీర్వదించిన సీఎం

ASR: అరకు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, శ్రీప్రియ దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మే 13న పాడేరులో జరిగిన వారి వివాహానికి సీఎం హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు దంపతులను తన క్యారవాన్‌లోకి ఆహ్వానించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.