W.G: ఉండి మండలం ఉప్పులూరులో రీ-సర్వే గ్రామసభ శనివారం జరిగింది. మండల తహసీల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు అధ్యక్షత వహించారు. MRO మాట్లాడుతూ.. గతంలో సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలు ఇవ్వడమే రీ సర్వే ఉద్దేశం అన్నారు. DT కునపరాజు సూర్యనారాయణరాజు, మండల సర్వేయర్ రత్నకుమారి, VROలు అప్పలాచార్యులు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేస్తాం: MRO


