GNTR: జిల్లాలో నీట్-పీజీ-2026 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్ఓ ఖాజావలి ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న ఆరు కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలతో పాటు పోలీస్ భద్రత కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నీట్-పీజీ పరీక్షలపై డిఆర్వో సమీక్ష


