హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

31న రోశయ్య విగ్రహావిష్కరణ

VSP: ఉమ్మడి ఎప్పీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఈ నెల 31న విశాఖపట్నంలో ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్ డూండి రాకేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.