హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

NRML: దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు పండితుడు రాజేందర్ రెడ్డిని, పీడీ నవీన్‌ను శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.