MDK: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామ పంచాయతీలో శనివారం విద్యార్థులతో క్రీడా వేడుకలు నిర్వహించారు. వివిధ ఆటల్లో ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు పాలకవర్గం తరఫున ఉచితంగా క్రీడా జెర్సీలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గట్టు సుశీలమ్మ, హెచ్ఎం విజయ విమల, ఉపసర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాయలపూర్లో క్రీడా దినోత్సవం వేడుకలు


