హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

KDP: సెప్టెంబరు 12న జమ్మలమడుగు కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉమర్‌ ఫరూక్‌ కోరారు. శుక్రవారం న్యాయవాదులతో సమావేశమై కేసుల పరిష్కారం, కక్షిదారులకు అవగాహన కల్పించడంపై చర్చించారు. రాజీ మార్గంలో కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.