KDP: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. జాబ్మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు


