హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటకు నేడు ముగ్గురు మంత్రుల రాక

SRPT: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.05 గంటలకు నూతనకల్‌ చేరుకుని సీలింగ్‌ భూముల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం సూర్యాపేట కలెక్టరేట్‌లో శంకుస్థాపనలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.