హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌ మృతి

SRPT: నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో విద్యుత్‌ షాక్‌తో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ సతీష్‌ (42) మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేస్తుండగా విద్యుత్‌ ప్రసరించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్‌రెడ్డి తెలిపారు.