హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారి లేక వరి పొలంలో నుంచి శవయాత్ర

KMR: రాజంపేటలోని శేర్ శంకర్ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా ఉన్న దారిని కొందరు దున్ని పొలం సాగు చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. శుక్రవారం తండాకు చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు అంత్యక్రియలకు తరలించేందుకు దారి లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని వరిపొలాల మధ్య నుంచి మోసుకెళ్లారు.