KNR: మధురనగర్లో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తుతెలియని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బైరి మునిందర్ కుటుంబంతో కలిసి ఆగస్టు 27న హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి 2 తులాల వెండి కడియాలు, తులం వెండి కైను, రూ. 12 వేల నగదు, గల్లాపెట్టెలోని రూ. 5 వేలు అపహరించారు.
తెలంగాణ
మధురనగర్లో చోరీ.. నగదు మాయం..!


