SRCL: ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ పద్మావతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పరశురాములు, అధ్యాపకులు శ్రీనివాస్, గంగాధర్, గౌతమీ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి


