BPT: స్పెషల్ టెట్కు నిరసనగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చీరాల పురవీధుల్లో 7 మండలాల ఉపాధ్యాయులతో బైక్ జాతా నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుమ్మోజు శ్రీనివాసరావు సమక్షంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సిద్ధం పాపారావు, ఆర్.పద్మావతి, బి.పద్మ, ఇతర జిల్లా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్పెషల్ టెట్కు నిరసనగా చీరాలలో యూటీఎఫ్ బైక్ జాతా


