కోనసీమ: అల్లవరం మండల ఎస్సై సంపత్కుమార్ ఆధ్వర్యంలో మండల నాయకులు, సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు షేర్ కాకుండా అడ్మిన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కట్టా నారాయణమూర్తి, అంగాని ధనుంజయ వర్మ, కంకిపాటి వీరబాబు, సోషల్ మీడియా వారియర్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'SM పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి'


